బెంగాల్ : పని మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన భాజాపా

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర భాజాపా సంచలన నిర్ణయం తీసుకుంది. పని మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అస్‌గ్రామ్‌ నియోజకవర్గం నుంచి పని మనిషి కవితని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. కవిత నెల రోజులపాటు తన పనికి సెలవు పెట్టి, ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఆమె ఏకంగా సీఎం మమతా బెనర్జీపైనే సటైర్స్ వేస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి. ఆట ఆడదాం అని ఎన్నికల ప్రచారంలో దీదీ చేస్తున్న నినాదాన్ని ఉద్దేశించి… ”మోకాలి గాయంతో ఎన్నికల ఆటను మమత ఎలా ఆడతారు” అంటూ వ్యంగ్యాస్తాల్రు సంధించారు. కలితా భర్త సుబ్రతా మజ్హీ.. ఓ ప్లంబర్‌. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేదు. అయితే లోక జ్ఝానం మెండిగా ఉన్న మహిళ. తన వాగ్దాటితో అదరగొడుతోంది. మరీ.. కవిత ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.