హాస్పటల్’లో చేరిన శ్రేయస్‌ అయ్యర్

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తూ.. టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే.స్కానింగ్‌ తీసిన తర్వాత గాయం తీవ్రత తెలిసింది. దాంతో అతడు సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ ఆడటం కూడా అనుమానమే. తాజాగా శ్రేయస్ బయో బుడగను వీడాడు. శస్త్రచికిత్స చేయించుకొనేందుకు ఆస్పత్రిలో చేరనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది.

అయితే తాను మరింత బలంగా పునరాగమనం చేస్తానని అయ్యర్‌ ధీమా వ్యక్తం చేశాడు. ‘ఎంత ఎక్కువ కష్టం ఉంటే అంత బలంగా పుంజుకుంటామని పెద్దలు చెబుతుంటారు. త్వరలోనే నేను తిరిగొస్తాను. మీ సందేశాలు చదివాను. మీ ప్రేమ, ఆప్యాయతలకు నేనెంతో సంతోషిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అయ్యర్‌ ట్వీట్‌ చేశాడు.