మైత్రీ ఇచ్చిన కాస్ట్లీ కారులో (గిఫ్ట్) గురు-శిష్యులు

టాలీవుడ్ లో ఉప్పెన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-కృతిశెట్టి జంటగా నటించిన చిత్రమిది. మైత్రీ మూవీస్ నిర్మించింది. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది. ఏకంగా వంద కోట్లు తీసుకొచ్చింది. నిర్మాతలకు భారీ లాభాలని తీసుకొచ్చింది. 


ఈ ఆనందంలో దర్శకుడు బుచ్చిబాబుకు క్లాస్ట్లీ కారు ఇవ్వబోతున్నారు. హైదరాబాద్ లో ఇల్లు లేదా  కారు కోరుకోమని ఆప్షన్ ఇచ్చారనే వార్తలు వినిపించాయ్. వీటిలో బుచ్చిబాబు కారు ఎంచుకున్నట్టున్నారు. తాజాగా మైత్రీ నిర్మాతలు బుచ్చిబాబుకు కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ కారులో గురువు సుకుమార్ ని ఎక్కించుకొని బుచ్చిబాబు షికారు కూడా చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక బుచ్చిబాబు రెండో సినిమా ఓ స్టార్ హీరోతో ప్లాన్ జరుగుతున్నట్టు సమాచారమ్. గురువు సుకుమార్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. బన్నీ-సుక్కు కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్. ఆ అంచనాలని అందుకొనేలా పుష్పని చెక్కే ప్రయత్నంలోనే సుకుమార్ ఉన్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా ఉండనుంది.