కీలక ప్రకటన చేసిన తీన్మార్ మల్లన్న

తీన్మార్ మల్లన కీలక ప్రకటన చేసారు. త్వరలో పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 6వేల కి.మీ. పాదయాత్ర చేస్తానన్నారు. తీన్మార్ మల్లన్న టీమ్ పేరిట రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. 

ఇటీవల నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తీన్మార్ మల్లన్న మంచి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఫలితం తర్వాత తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు వినిపించాయి. అది నిజమే. కానీ అంతకంటే ముందు పాదయాత్ర చేసి.. జిల్లా, మండల స్థాయిలో కమిటీలని ఏర్పాటు చేసుకున్న తర్వాత పార్టీ ప్రకటన చేయనున్నారని సమాచారమ్.