జగన్‌ సేవ ‘వర్సెస్’‌ జనం సేవ !

తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయ్. వైకాపా-భాజాపాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నిన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ట్విటర్‌లో విమర్శల వార్‌ జరగ్గా ఇవాళ భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు … వైకాపా పై విమర్శల వర్షం కురిపించారు. 

ఎం జగన్‌కు వ్యక్తిగత సేవలు అందించిన వ్యక్తి …ఎంపీగా చేసేందుకు అర్హులా? అని తిరుపతి వైకాపా అభ్యర్థి గురుమూర్తిపై విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత సేవలు చేసిన వారికి ఇవ్వటానికి నామినేటెడ్‌ పోస్టులు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. జగన్‌ సేవ వర్సెస్‌.. జనం సేవ. దేన్ని ఎంచుకోవాలో ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇంకా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనేలేదు. ఆయన వస్తే.. హీటు మరింత పెరగడం ఖాయం.