ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. మళ్లీ టాప్’లోకి కోహ్లీ !

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌  ని విడుదల చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (870 రేటింగ్స్) తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మూడో ర్యాంకులో ఉన్నాడు. వరుసగా అర్ధశతకం, శతకం బాదేసిన కేఎల్‌ రాహుల్‌ 31 నుంచి 27వ ర్యాంకుకు ఎగబాకాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ జాబితాలో 42వ ర్యాంకు దక్కించుకున్నాడు. రిషభ్ పంత్‌ టాప్‌-100లో అడుగుపెట్టాడు.

వివాహం వల్ల ఇంగ్లాండ్‌ సిరీస్‌కు దూరమైన బుమ్రా ఖాతాలో 690 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తొమ్మిది స్థానాలు మెరుగై 11వ ర్యాంకుకు ఎగబాకాడు. యువ పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ 93 నుంచి 80వ ర్యాంకుకు చేరుకున్నాడు. బ్యాటింగ్‌ జాబితాలో బెన్‌స్టోక్స్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకు సాధించాడు. శతక వీరుడు జానీ బెయిర్‌స్టో తిరిగి తన ఏడో ర్యాంకు సొంతం చేసుకున్నాడు.