తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ తెలంగాణ ఉద్యోగుల కోరిక తీర్చాడు. తెలంగాణకు చెందిన 711 ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు. వీరంతా క్లాస్‌-3, క్లాస్‌-4 ఉద్యోగులు. వీరంతా తమ సొంత రాష్ట్రానికి పంపించాలని కోరుతున్నారు. వీరి తరఫున కొంతమంది ప్రతినిధులు బుధవారం సీఎం జగన్‌ను కలిశారు.

తెలంగాణ ప్రభుత్వంలో సర్వీసులు కొనసాగించేందుకు వీలుగా తమను రిలీవ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. వారిని రిలీవ్‌ చేసేందుకు అంగీకారం తెలిపారు.  వెంటనే.. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు

. సొంతరాష్ట్రానికి వెళ్తున్న ఉద్యోగులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఫోటోలి దిగారు. ఏపీ ప్రభుత్వం తమను రిలీవ్‌ చేయడంతో తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. వెలగపూడిలోని సచివాలయం వద్ద బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి.. తెలంగాణ ఉద్యోగులని సీఎం జగన్ ఖుషి చేశారు.