స్వ‌యం పాల‌న ప్ర‌క‌టించుకున్న ఆదివాసీలు..!!

తెలంగాణ‌లో ఆదివాసీల నిర‌స‌న‌లు తారాస్తాయికి చేరాయి. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ ఆత్మ‌గౌర‌వ పోరాటం ఓ రేంజ్ లో కొన‌సాగుతోంది. లంబాడాలు, ఆదివాసీల‌కు మ‌ధ్య రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో గ‌త కొంత‌కాలంగా వివాదం న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో గురువారం ఆదివాసీల‌పోరాటంప‌తాక‌స్థాయికిచేరింది.

అర్థ‌రాత్రి స్వ‌యం పాల‌న ప్ర‌క‌టించుకున్నారు ఆదివాసులు.త‌మ గూడేల్లోకి లంబాడా అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను రానివ్వ‌బోమంటూ తీర్మాణం చేసుకున్నారు. కుంరంభీం జిల్లా జైనూర్ మండ‌లం మ‌ర్ల‌వాయిలో అర్ధ‌రాత్రి గోండులు తుడుం మోగించారు. లంబాడాల‌ను ఎస్టీ జాబితా నుంచి తొలిగించే వ‌ర‌కు ఉద్య‌మం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.