TSలో రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 887 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1701కి చేరింది. 

నిన్న కరోనా నుంచి మరో 337 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,01,564గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 5,511 యాక్టివ్‌ కేసుల్లో 2,166 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇక రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.