పార్టీ మార‌డంపై స్పందించిన ర‌ఘువీరా

గ‌త కొంత‌కాలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షులు ర‌ఘువీరారెడ్డి పార్టీ మార‌తారంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ అంశంపై ఆయ‌న స్పందించారు. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. తాను త‌న ప్రాణ‌మున్నంత వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని చెప్పారు ర‌ఘువీరా.

ఏపీకి మంచి లీడ‌ర్ ను ఇంచార్జిగా నియ‌మించార‌ని, 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక‌హోదా గురించి ప్లీనరీలో పార్టీ తీర్మాణం చేసింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌తో క‌లిసివ‌చ్చే పార్టీల‌తో క‌లిసి ప్ర‌యాణం చేస్తామ‌ని చెప్పారు. క‌ర్నాట‌క‌లో రాహుల్ గాంధీని చంద్ర‌బాబు క‌ల‌వ‌డంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వెలువ‌డుతున్నాయ‌ని, టీడీపీ కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీ అని గుర్తుంచుకోవాల‌ని ఆయ‌న చెప్పారు.