ఓటు వేసిన అజిత్-షాలిని

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఈ ప్రారంభమైంది. మరోవైపు అసోం, బెంగాల్‌ శాసనసభలకు మూడో దశ పోలింగ్‌ జరుగుతోంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొత్తం 475 స్థానాల్లో 20 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఈ ఉదయమే పోలింగ్ కేంద్రానికి వచ్చి.. తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తమ భార్య షాలినితో కలిసి #Thiruvanmiyur పోలింగ్ కేంద్రానికి వచ్చారు. జనాలతో కలిసి క్యూ లైన్ లో నిల్చొని.. ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అజిత్-షాలిని క్యూలైన్ లో నిల్చున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 తమిళనాడులో నేడు ఒకే దశలో 234 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక్కడ అన్ని స్థానాల్లో కలిపి మొత్తం 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 6.28 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు భారీగా ఉచిత హామీలు ప్రకటించాయి.