మరో బాలీవుడ్ హీరోయిన్’కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు, సెలబ్రెటీలు కరోనా బారినపడుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో అలియాభట్‌, మిలింద్‌, ఆర్‌ మాధవన్‌, అమీర్‌ఖాన్‌, రణబీర్‌ కపూర్‌, కరిక్‌ ఆర్యన్‌, రోహిత్‌ సరఫ్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, మనోజ్‌ బాజ్‌పేయి, రణ్‌వీర్‌ షోరే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ బప్పిలహరి, అక్షయ్ కుమార్,  విక్కీ కౌశల్, భూమి పెండేకర్ తదితరులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. 

ఈ విషయాన్ని కత్రినా.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లాను. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నా. వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల కాలంలో నాతో కలిసిన వాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొంది.

ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన నటిస్తోన్న ‘రామసేతు’ చిత్ర యూనిట్‌ సభ్యుల్లో 40మందికిపైగా జూనియర్‌ ఆర్టిస్టులు సైతం కరోనా బారినపడ్డారు. కత్రినాకైఫ్‌ ‘సూర్యవంశీ’ సినిమాలో అక్షయ్‌తో కలిసి నటించింది. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా కత్రినా కైఫ్‌ బాయ్‌ఫ్రెండ్‌గా వార్తల్లో నిలుస్తున్న విక్కీ కౌశల్‌ కూడా కరోనాకు గురయ్యాడు.