ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

  ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. ఎన్నికలు యథాతథంగా నిర్వహించవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో రేపటి ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటికే పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామగ్రితో గ్రామాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.