ఢిల్లీలో వైభ‌వంగా యాదాద్రి ల‌క్ష్మీ నార‌సింహుడి క‌ళ్యాణం

తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్బంగా న్యూఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ లో యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ నర‌సింహ స్వామివారి క‌ళ్యాణం వైభ‌వోపేతంగా జ‌రిగింది. దేశంలో తెలంగాణ రాష్ట్రం అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచేలా అభివృద్ధిని సాధించాల‌ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం స్వామివారి క‌ళ్యాణ మ‌హోత్స‌వాన్ని అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించింది. స్వామివారి క‌ళ్యాణ‌మ‌హోత్స‌వానికి భార‌త ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్యానాయుడు, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్, బీజేపీనాయ‌కులు కిష‌న్ రెడ్డి, మాడ‌బూషి శ్రీ‌ధ‌ర్ తో పాటు ఇత‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు.