ఐపీఎల్ : టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ

ఐపీఎల్ 14 సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన RCB కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బాగుంది. బౌలింగ్ కు అనుకూలిస్తుందని  భావిస్తున్నాం అన్నారు కోహ్లీ.

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అత్యధిక (5) సార్లు టైటిల్ గెలిచింది. అయితే ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్ కొట్టలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన కప్ కొట్టాలని కసితో కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది. మరోవైపు 2019, 2020 సీజన్ లోనూ ముంబై టైటిల్స్ గెలుచుకొంది. ఈ సారి కూడా కప్ కొట్టి హ్యాట్రిక్ నమోదు చేయాలని రోహిత్ సేన భావిస్తోంది.

#RCB Captain @imVkohli wins the toss and elects to bowl first against #MumbaiIndians in the season opener of #VIVOIPL 2021.

Follow the game here – https://t.co/9HI54vpf2I #MIvRCB pic.twitter.com/haOAZAEUfx— IndianPremierLeague (@IPL) April 9, 2021