దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లని కాపాడటం సోల్జర్ పని !

 అడివి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘మేజర్’. ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గూఢచారి ఫేం శశికిరణ టిక్కా దర్శకుడు. శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా సాయి ఎం మంజ్రేకర్ నటిస్తున్నారు.

తాజాగా మేజర్ టీజర్ ని విడుదల చేశారు. ముంబై దాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆఖరి క్షణాలతో టీజర్ మొదలవుతోంది. ఆ వెంటనే మేజర్ చిన్ననాటి కల.. మేజర్ ఎందుకు కావాలనుకుంటున్నావని తండ్రి అడిగిన ప్రశ్నకు సమాధానం. టీనేజ్ లవ్ స్టోరీ, సోల్జర్ అంటే ఏంటీ.. ? సమాధానం. ముంబై పేలుళ్లు.. బిట్ సీన్స్ తో టీజర్ ని ఆసక్తికరంగా కట్ చేశారు. ‘దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లని కాపాడటం సోల్జర్ పని’ అనే డైలాగ్ బాగుంది.  

ఇక ఈ సినిమా కోసం అడవి శేష్ కొన్నాళ్లు రిసెర్చ్ చేశారు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కుటుంబంలో ప్రయాణం చేశారు. సందీప్ బాల్యం, ప్రేమ, కెరీర్.. ఇలా అన్నింటిపై అవగాహన పెంచుకున్నారు. కథా రచనలోనూ అడవిశేష్ ప్రమేయం ఉంది. ఇలా అన్ని పక్కాగా చేసుకున్న తర్వాత సినిమాని మొదలెట్టారు. దీంతో అవుట్ పుట్ అద్భుతం వస్తోంది. మేజర్ సూపర్ హిట్ గ్యారెంటీ అని చెబుతున్నారు. మేజర్ ని టీజర్ ని చూస్తే.. రొమాలు నిక్కబొడుస్తున్నాయి. ఇక సినిమా మొత్తం ఆ రేంజ్ లో ఉంటే.. అద్భుతమే.. !