TSలో 3వేల కొత్త కేసులు

తెలంగాణలో తీవ్ర రూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,307 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ఎనిమిది మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,788కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 897 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,08,396కి చేరింది. ప్రస్తుతం దేశంలో 27,861 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 1,038 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మొత్తం కరోనా కేసులు 1,40,74,564కు చేరాయి. మృతుల సంఖ్య 1,73,123కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 93,528 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,24,29,564కి చేరాయి. ప్రస్తుతం దేశంలో 14,71,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి.