దారుణం : సర్పదోశం పోతుందని ఆర్నెళ్ల చిన్నారిని బలి ఇచ్చిన తల్లి

సూర్యపేట జిల్లా మోతె మండలం మేకలపాడులో దారుణం చోటు చేసుకుంది. తనకున్న సర్పదోశం పోతుందని ఓ తల్లి ఆర్నెళ్ల చిన్నారిని హత్య చేసింది. అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసింది. ఆరేళ్లు బానోతు భారతి ఆరోగ్యం బాగులేదు. ఆమెకు సర్పదోశం ఉందని మాంత్రికుడు చెప్పినట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలో నిత్యం ఇంట్లో పూజలు చేయడం, నాగదోశం పోవడానికి యూట్యూబ్ లో వీడియోలు చూసేదని తెలుస్తోంది. ఈ క్రమంలో వాటితో ప్రేరేపితమైన భారతి.. తన ఆర్నెళ్ల చిన్నారిని గొంతుకోసి హత్య చేసింది.

భారతి విద్యావంతురాలు కూడా. బీఎడ్ పూర్తి చేసింది. గ్రూప్స్ కోసం ప్రీపేర్ అవుతుంది. అలాంటి భారతి ఇలాంటి దారుణానికి పాల్పడింది. ఆమె భర్త బయటికి వెళ్లిన సమయంలో భారతి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బానోతు భారతి కి ఇదో రెండో పెళ్లి అని తెలుస్తోంది. అంతేకాదు.. ఆమె మానసిక పరిస్థితి కూడా బాగుండేదని కాదని తెలిసింది.