కరోనా విశ్వరూపం.. రెండో రోజు 2లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతితో ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,17,353 కొత్త కేసులు నమోదయ్యాయ్. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,91,917 చేరింది. నిన్న 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,74,308 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 


ఇక, క్రియాశీల కేసులు 15లక్షలకు పైబడి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ రేటు 10.46శాతానికి పెరిగింది. ఇక నిన్న లక్షమందికి పైగా కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. గడిచిన 24గంటల్లో 1,18,302 మంది కోలుకోగా..మొత్తంగా కోటీ 25లక్షల మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 88.31 శాతానికి పడిపోయింది