ఓటర్లకు ప్రధాని ట్విట్టర్ సందేశం

మరో ఓటింగ్ డే వచ్చేసింది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఐదో విడత ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఉపఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా ఓ సందేశాన్ని విడుదల చేశారు.

ఉపఎన్నికల్లో ప్రజలు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 
ముఖ్యంగా కొత్తగా ఓటు వచ్చిన యువత తమ హక్కును మరిచిపోవద్దని సూచించారు. ప్రజలు తమ విధిగా పోలింగ్‌లో పాల్గొని దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. అయితే దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓటర్లు ఏ మేరకు కదిలి వస్తారు అన్నది చూడాలి. 

There are by-polls taking place in different parts of the country. I urge voters in the seats polling today to vote in record numbers and strengthen the festival of democracy.— Narendra Modi (@narendramodi) April 17, 2021