మార్పింగ్ కేసు : ఉమకు మరోసారి సీఐడీ నోటీసులు

తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. దేవినేని ఉమపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు ఇప్పటికే సీఐడీ సమన్లు కూడా జారీ చేసింది. ఈ నెల 19న కర్నూల్ సీబీఐ కార్యాలయంలో హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు హాజరైయ్యేందుకు తనకు 10 రోజులు సమయం కావాలని ఉమా కోరారు. 


అందుకు సీఐడీ అధికారులు ఒప్పుకోలేదు. అదనంగా మరో రెండ్రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి సీఐడీ అధికారులు దేవినేని ఉమకు నోటీసులు జారీ చేసింది. ఇందులో అదనంగా రెండ్రోజుల సమయం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఆరోజు తప్పకుండా విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇక ఈ మార్పింగ్ కేసులో దేవినేని ఉమపై సెక్షన్ 464, 465, 468, 471, 505 కింద సీఐడీ కేసు నమోదు చేసింది.