వాట్సాప్ యూజర్లకు ఓ హెచ్చరిక

వాట్సాప్ యూజర్లకు ఓ హెచ్చరిక. ‘వాట్సప్‌’లో భద్రతపరమైన కొన్ని ముప్పులు పొంచి ఉన్నాయని భారత సైబర్‌ భద్రతా సంస్థ ‘సెర్ట్‌-ఇన్‌’ హెచ్చరించింది. వీటివల్ల సున్నితమైన సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. దీని తీవ్రత రేటింగ్‌ చాలా అధికంగా ఉందని తెలిపింది. 

వీ2.21.4.18 (ఆండ్రాయిడ్‌), వీ2.21.32 (ఐవోఎస్‌)కు ముందున్న వాట్సప్‌ వెర్షన్లలోని సాఫ్ట్‌వేర్‌లో ఈ ముప్పులను గుర్తించినట్లు పేర్కొంది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి సైబర్ సంస్థ కొన్ని సూచనలు కూడా చేసింది. ఈ యాప్  వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్, ఐవోఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి వాట్సప్‌కు సంబంధించిన తాజా వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఇలా చేస్తే.. భద్రతా పరంగా ఇబ్బందులు ఉండవని తెలిపింది.