కరోనా కాటు.. ఒక్కరోజులోనే 1,501 మంది మృతి !

దేశంలో కరోనా మరణమృదంగం మ్రోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,61,500 కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కు చేరింది. నిన్న ఒక్కరోజులోనే 1,501 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,77,150కు చేరింది. ఇక మరణాల రేటు 1.21శాతానికి చేరింది.

నిన్న 1,38,423 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,28,09,643 చేరి, 87.23 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 18,01,316 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 67,123 కేసులు నమోదు కాగా.. 419 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దిల్లీలో 24,375 కేసులు నమోదు కాగా, 167 మంది మృతి చెందారు.