కాళేశ్వ‌రానికి లైన్ క్లియ‌ర్..

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ఇక లైన్ క్లియ‌ర్ అయింది. ఇప్ప‌టికే అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులతో పాటు ఇత‌ర అనుమ‌తులు ల‌భించాయి. శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నులను మంత్రి హ‌రీష్ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు.. తాజాగా టెక్నిక‌ల్ అడ్వైజ‌ర్ క‌మిటీ క్లియ‌రెన్స్ కూడా ల‌భించ‌డంతో కాళేశ్వ‌రానికి ఇక అడ్డంకులు తొల‌గిపోయిన‌ట్లేన‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

ఢిల్లీలో జ‌రిగిన స‌మావేశంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు కేంద్ర జ‌ల మంత్రిత్వ శాఖ టెక్నికల్ అడ్వైజ‌ర్ క‌మిటీ క్లియ‌రెన్స్ ఇచ్చింది. టీఏసీ క్లియ‌రెన్స్ ల‌భించ‌డంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి హ‌రీష్ రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర జ‌ల‌వ‌న‌రుల మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి మంత్రి హ‌రీష్ రావు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.