మహేష్-త్రివిక్రమ్.. ఓ ఫ్యామిలీ డ్రామా !

మళ్లీ కరోనా విజృంభణతో టాలీవుడ్ లెక్కలు మారిపోయిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సిన ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేసేందుకు ఫిక్సయ్యాడు. ఇక ‘పుష్ప’ తర్వాత కొరటాల శివతో జతకట్టాల్సిన అల్లు అర్జున్.. ఐకాన్ కు ఓకే చెప్పేశారు. వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ తో దర్శకుడు వేణు శ్రీరామ్ పై ఆయనకు కలిగిన నమ్మక ఫలితమిది.


ఇక తారక్ తో సినిమా అనుకున్న త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడీ.. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయ్. త్రివిక్రమ్ ఫార్మెట్ లోనే ఈ కథ ఉండనుందట. ఓ కుటుంబం ఏదో స‌మ‌స్య‌లో ఉంటుంది.. హీరో అక్క‌డ‌కు వెళ్లి, ఆ స‌మ‌స్య‌ల్ని తీర్చేస్తాడు. అత్తారింటికి దారేది, అజ్ఞాత‌వాసి, అల వైకుంఠ‌పుర‌ములో.. ఈ క‌థ‌ల‌న్నీ అవే బాప‌తు. అయితే త్రివిక్రమ్ ట్రీట్ మెంట్ కొత్తగా ఉండటంతో.. అవి పాతకథలే అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలగదు. ఇప్పుడు మహేష్ సినిమా కోసం ఇదే ఫార్మెట్ ని ఎంచుకున్నారట త్రివిక్రమ్. 

ఇప్పుడు మ‌హేష్ కోసం ఓ ఫ్యామిలీ డ్రామా ని సిద్ధం చేశాడట త్రివిక్ర‌మ్. అయితే అందులోనూ యాక్ష‌న్ పుష్క‌లంగా ఉండేలా జాగ్రత్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌.  ఈసినిమాని వీలైనంత త్వ‌ర‌గా.. ఇంకా చెప్పాలంటే.. ఈ యేడాదియే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో త్రివిక్రమ్ ఉన్నారట. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమాని మొదలెట్టబోతున్నారని తెలుస్తోంది.