#IPL2021 : ముంబైపై ఢిల్లీ గెలుపు

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసింది. దిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ షా అద్భుత ప్రదర్శనతో 4 వికెట్లు తీసి ముంబయి నడ్డివిరిచాడు.

ముంబయి జట్టులో కెప్టెన్‌ రోహిత్‌శర్మ (44; 30 బంతుల్లో 3×4, 3×6) ఒక్కడే రాణించాడు. ఇషాన్‌ కిషన్‌(26; 28 బంతుల్లో 1×4, 1×6), జయంత్‌ యాదవ్‌(23; 22 బంతుల్లో 1×4) పర్వాలేదనిపించారు. ఢిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా మధ్య ఓవర్లలో ముంబయి వెన్నువిరిచాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి (4/24) ప్రదర్శనతో ముంబయిని కట్టడి చేశాడు.

138 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్‌ ధావన్‌(45: 42 బంతుల్లో 5×4 1×6),స్టీవ్‌ స్మిత్‌ (33: 29 బంతుల్లో 4×4) రాణించారు. వీరిద్దరు అవుటైన తర్వాత లలిత్‌(22 నాటౌట్‌; 25 బంతుల్లో 1×4), హెట్మేయర్‌(14 నాటౌట్‌; 9 బంతుల్లో 2×4) మిగితా పని పూర్తి చేశారు. విజయం అధించారు. ముంబయి బౌలర్లలో జయంత్‌, బుమ్రా, చాహర్‌, పొలార్డ్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.