హైదరాబాద్ గెలిచేసిందోచ్ !

ఐపీఎల్ 2021లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోని కొట్టింది. పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఒక వికెట్‌ కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. డేవిడ్‌ వార్నర్‌ (37) ఔటైనా.. బెయిర్‌స్టో (63), కేన్‌ విలియమ్సన్‌ (16) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ కు దక్కిన తొలి విజయమిది.

టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ 19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (22; 25 బంతుల్లో 2×4), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ ఖాన్‌ (22; 17 బంతుల్లో 2×6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 3/21, అభిషేక్‌ శర్మ 2/24 రాణించారు. ఇక భువనేశ్వర్‌, సిద్ధార్థ్‌, రషీద్‌ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.