18యేళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి !

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 18యేళ్లు పైబడిన వారందరికీ కరోనా వాక్సిన్ అందించాలని నిర్ణయించింది. మే 1 నుంచి వారికి వాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఈ నెల 24 అంటే శనివారం నుంచి కొవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.

కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ విధానం : 

* కొవిన్ పోర్టల్‌(cowin.gov.in)లో లాగిన్ చేసి, మొబైల్ నంబర్ నమోదుచేయాలి.

* ఆ వెంటనే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.

* ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్’ పేజ్‌ ఓపెన్ అవుతోంది.

* దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.

* ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి.

* పిన్‌కోడ్ ఎంటర్ చేసి, వెతికితే.. దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. 

* టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.