ధోని తల్లిదండ్రులకి కరోనా.. లెటెస్ట్ అప్ డేట్ !

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తల్లిండ్రులు దేవకి దేవి-పాన్‌సింగ్‌ కొవిడ్‌ బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు రాంచీలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు బుధవారం వార్తలు వచ్చాయ్. తాజాగా సాక్షి ధోని తల్లిదండ్రుల హెల్త్ అప్ డేటు ఇచ్చారు. ‘కరోనా పాజిటివ్ గా తేలగానే ధోని తల్లిదండ్రులని హాస్పటల్ కి తరలించాం. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయండని’ అని సాక్షి ట్విట్ చేశారు.

ప్రస్తుతం ధోని ఐపీఎల్ 2021లో ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా వ్యవహిరిస్తున్నారు. బుధవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ధోని 8 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇందులో ఓ భారీ సిక్సర్ కూడా ఉంది. ఇక చెన్నై తదుపరి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగనుంది.