బెంగళూరు చేతిలో రాజస్థాన్ చిత్తు చిత్తు

తాజా ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయ యాత్ర కొనసాగుతూనే ఉంది. ముంబయి వేదికగా గురువారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 179 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా ఛేదించింది.

ఓపెనర్లుగా వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కల్‌(101నాటౌట్‌; 52 బంతుల్లో 11×4, 6×6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(72నాటౌట్‌; 47 బంతుల్లో 6×4, 3×6) ధాటిగా ఆడారు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. తొలుత టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా తర్వాత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆదుకున్నారు. శివమ్‌ దూబె (46; 32 బంతుల్లో 5×4, 2×6), రియాన్‌ పరాగ్‌ (25; 16 బంతుల్లో 4×4), రాహుల్‌ తెవాతియా (40; 23 బంతుల్లో 4×4, 2×6) రాణించారు.