యాంకర్ శ్యామల భర్తపై చీటింగ్ కేసు.. షాకింగ్ నిజాలు !

యాంకర్‌ శ్యామల భర్త, నటుడు లక్ష్మీనరసింహారెడ్డి చీటింగ్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో మరో మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఖాజాగూడ గ్రీన్‌ గ్రేస్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే సింధూరారెడ్డి (31) వ్యాపారిని సంప్రదించిన లక్ష్మీనరసింహారెడ్డి (37)..  తనకు గండిపేటలో రూ.100 కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల స్థలం ఉందని, దాంట్లో ఈతకొలను, పబ్, గేమ్‌ జోన్‌ వంటివి అభివృద్ధి చేసేందుకు పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించాడు.

అందుకు అంగీకరించిన  సింధూరారెడ్డి 2017 ఆగస్టులో రూ.85 లక్షలు నగదు, చెక్కుల రూపంలో ఇచ్చింది. ఐతే ముందుగా చెప్పినట్టుగా..  ఆ స్థలంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. దీంతో సింధూర రెడ్డి.. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో బెదిరించేవాడు. మరోవైపు లక్ష్మీనరసింహారెడ్డి సోదరినంటూ మౌలాలి హెచ్‌బీ కాలనీ ప్రాంతానికి చెందిన మట్టా జయంతి గౌడ్‌ (31) బాధితురాలిని పరిచయం చేసుకుని వేధించేది. దీంతో సింధూర రెడ్డి గతనెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మీనరసింహారెడ్డిని, జయంతి గౌడ్‌ను అరెస్టు చేశారు. గతంలోనూ లక్ష్మీనరసింహారెడ్డి ఇలాంటి చీటింగ్ లు చాలానే చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.