TSలో 4976 కేసులు.. 35 మరణాలు !

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4976 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,97,361కి చేరింది. కరోనా మహమ్మారితో తాజాగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 2,739కి పెరిగింది. 

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 851 కేసులు, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 384, మహబూబ్‌నగర్‌లో 208 కేసులు నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా రిపోర్ట్ ఏమాత్రం నిజం కాదు. వాస్తవంగా ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా మృతి చెందుతున్నారనే ప్రచారం ఉంది.