టీమిండియా కోచ్ గా మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు టీమిండియాతో కలిసి ప్రయాణం చేయనున్నారట. ఇంకా చెప్పాలంటే కోహ్లీ సేనకు కోచ్ గా మారనున్నాడట. ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. బ్యాకింగ్ కుంభకుణం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుంది. ఈ నెలలోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ సినిమా కోసం ‘పార్థు’ అనే టైటిల్ వినిపిస్తోంది.

ఇక త్రివిక్రమ్ సినిమా తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ కాంబో రిపీట్ కానుందట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేయనున్నారట. ఈ సినిమాలో మహేష్ క్రికెట్ కోచ్ గా కనిపిస్తారని సమాచారమ్. సరిలేరు నీకెవ్వరులో మహేష్ ని ఆర్మీ ఆఫీసర్ గా చూపించాడు అనిల్ రావిపూడి. తాజా సినిమాలో మహేష్ కి క్రికెటర్ గా మార్చబోతున్నారట. క్రికెట్ కోచ్ అంటే దాదాపు జాతీయ జట్టుకే అయి ఉంటుంది. ఈ లెక్కెన కోహ్లీ సేనకు మహేష్ క్రికెట్ పాఠాలు చెప్పబోతున్నారు అన్నమాట.