సల్మాన్ తో ఆ.. సమస్య తీరిపోయింది : పటానీ

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్ వాంటెడ్ భాయి’. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమా ఈరోజే (మే 13) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ దిశా పటానీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

“నా జీవితంలో ఇంత వరకు ఇలాంటి మాస్ చిత్రంలో నటించలేదు. ఇందులో నటించడం చాలా ఆనందంగా ఉంది. చిత్రానికి సంబంధించి స్ర్కిప్టు నాకెంతో నచ్చింది. ఓ పెద్ద దర్శకుడితో పాటు పెద్ద హీరోతో కలిసి పనిచేయడం నా అదృష్టం. సల్మాన్‌తో తొలిసారిగా ‘భారత్‌’లో కలిసి పనిచేశాను. అప్పుడు కొంచెం భయపడ్డా. బాలీవుడ్‌లోనే పెద్ద హీరో. అలాంటిది ఆయన పక్కన ఎలా నటిస్తానో అని భయమేసింది. కానీ ఇప్పడు రెండోసారి ‘రాధే’తో ఆ సమస్య తీరిపోయింది. సెట్లో ఆయన నాకెంతో సహకరించారు” అని చెప్పుకొచ్చింది హాట్ బ్యూటీ. 

అన్నట్టు.. రాధేలో తెలుగు ఫ్లేవర్ కూడా ఉంది. అల్లు అర్జున్‌ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’లోని ‘సీటీమార్‌’ గీతాన్ని ఇందులో రీమేక్‌ చేశారు. జీ స్టూడియోస్‌, రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన సినిమాకి అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్‌ నిర్మాతలు. ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలో జీ ప్లెక్స్‌, డిష్‌ టీవీల్లోనూ ‘రాధే’ ఈరోజు అర్థరాత్రి ప్రసారం కానుంది. ఇప్పటికే దుబాయ్ లో షోస్ పడిపోయాయ్.