బన్నీకి 50కోట్ల పారితోషికం

టాలీవుడ్ లో అత్యధిక పారితోషం అందుకొనేది పవర్ స్టార్ పవన్ కల్యాణే. ఆయనకు ఒక్క సినిమాకి రూ.50 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. ‘వకీల్ సాబ్’ కోసం పవన్ రూ. 50కోట్లు తీసుకున్నారట. ఇప్పుడు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ రేంజ్ ని అందుకున్నాడటని టాక్. బన్నీ-సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సింగిల్ పార్ట్ గా స్క్రిప్ట్ రెడీ చేసిన.. ఈ సినిమా ఇప్పుడు డబుల్ పార్ట్స్ అయింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రెండు భాగాలు చేసినందుకు సినిమా బడ్జెట్ లో పెద్దగా మార్పుల్లేవ్. కానీ పారితోషికాల్లో పెరుగుదల ఉండనుందని సమాచారమ్. ముఖ్యంగా రెండో భాగానికి గానీ బన్నీ రూ. 50కోట్ల పారితోషికం అందుకోనున్నట్టు సమాచారమ్.మొదటి భాగానికి మాత్రం యాభై కోట్లు తీసుకోవట్లేదట. లాభాల్లో వాటా వుండడం వల్ల తగ్గించి తీసుకున్నారని.. రెండో భాగానికి మాత్రం బన్నీ రూ. 50కోట్లు ఇవ్వడానికే ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

ఇక పుష్ప పార్ట్ వన్ ఈ యేడాది, రెండో భాగం వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయ్. ఐతే, పార్ట్ వన్ ని మించి పార్ట్ 2 ఉంటుందని పుష్ప నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. ఎందుకంటే ? పార్ట్ 1ని లోకల్ గా తెలుగు రాష్ట్రాల్లోనే.. వికారాబాద్ అడవుల్లో తెరకెక్కించారు. రెండో పార్ట్ కోసం మాత్రం అవుట్ ఆఫ్ వెళ్తారట. భయంకరమైన అడవుల్లో షూటింగ్ చేస్తారట. అందుకే పార్ట్ వన్ కంటే పార్ట్ 2 విజువల్ గా హై గా తీస్తామని ఇప్పుడే చెప్పేస్తున్నారు.