ఏపీలో 96 మంది మృతి

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 22,018 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. మరో 96 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 13,88,803కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 9, 173కిపెరిగింది.

నిన్న 19,117 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 2,03,787 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మృతుల్లో అనంతపురంలో అత్యధికంగా 11 మంది, తూర్పు గోదావరి, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10 మంది, విజయనగరంలో 9 మంది, చిత్తూరు, కృష్ణ జిల్లాల్లో 8 మంది, గుంటూరు, నెల్లూరులో ఏడుగురు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, కడప జిల్లాలో నలుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.