విరుష్క దంపతులు కరోనా సాయం రూ. 11కోట్లు

కరోనా విజృంభిస్తున్న వేళ విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా బాధితులకు సహాయం అందించేందుకు ‘ఇన్‌ దిస్‌ టుగెదర్‌’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. రూ.2 కోట్ల విరాళం అందించి విరుష్క దంపతులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.7 కోట్ల విరాళాలు సేకరించాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే, ఎంపీఎల్‌ అనే క్రీడా సంస్థ వారికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ లక్ష్యాన్ని రూ.11 కోట్లకు పెంచుకున్నారు. తమ లక్ష్యాన్ని అధిగమించినట్లు విరుష్క దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. మేం తొలుత నిర్దేశించుకున్న లక్ష్యం కన్నా ఎక్కువ మొత్తం సేకరించడం గర్వంగా ఉంది. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఇదిలాగే కొనసాగుతుంది. దేశ ప్రజలకు సహాయం చేయడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు అంటూ అనుష్క ట్విట్ చేసింది.