కేసీఆర్ పై హత్యాయత్నం కేసు

ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్ ని అడ్డుకోవడంపై తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. రాజకీయ వర్గాలు, ప్రజలు అది సరైన నిర్ణయం కాదంటున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ పై కూడా కోర్టు స్టే విధించింది.

అంబులెన్స్ ఆపుతున్న వ్యవహారంపై సీఎం కేసీఆర్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీజేపీ మహిళా నేత విజయశాంతి డిమాండ్ చేశారు. 

“వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేసి ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ పాలకుల తీరును అన్ని వర్గాలూ తప్పుబడుతున్నా ఈ సర్కారు స్పందించడం లేదు.

తెలంగాణ సర్కారు తీరుతో సరిహద్దుల వద్ద పలువురు రోగులు మృత్యుముఖానికి చేరువయ్యే పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి గాను తెలంగాణ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు.

సరిహద్దుల్లో అంబులెన్సులను అపే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయా… అన్న హైకోర్టు ప్రశ్నకు సైతం అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. అఆస్పత్రులలో బెడ్స్ కన్ఫర్మ్ చేసుకుని, అందుకు రుజువులు చూపిస్తున్నా అనుమతించకపోవడం దారుణం. ఈ విషయంలో తెలంగాణ సర్కారు వైఖరిని ఇటీవలే నాతో సహా విపక్షాలన్నీ ఖండించాయి” అంటూ రాములమ్మ వరుస ట్విట్ చేశారు.

వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేసి ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ పాలకుల తీరును అన్ని వర్గాలూ తప్పుబడుతున్నా ఈ సర్కారు స్పందించడం లేదు.— VijayashanthiOfficial (@vijayashanthi_m) May 14, 2021

తెలంగాణ సర్కారు తీరుతో సరిహద్దుల వద్ద పలువురు రోగులు మృత్యుముఖానికి చేరువయ్యే పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి గాను తెలంగాణ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు.— VijayashanthiOfficial (@vijayashanthi_m) May 14, 2021

సరిహద్దుల్లో అంబులెన్సులను అపే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయా… అన్న హైకోర్టు ప్రశ్నకు సైతం అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.— VijayashanthiOfficial (@vijayashanthi_m) May 14, 2021