రఘురామ.. మీ వెనకున్నది ఎవరు ?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) ను సీఐడీ అధికారులు నిన్న హైదరాబాద్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారనే అభియోగాలతో ఆర్ఆర్ఆర్ ని అరెస్ట్ చేశారు. గుంటూరు తీసుకెళ్లారు. అర్ధరాత్రి వరకు అదనపు డీజీ సునీల్‌కుమార్ నేతృత్వంలో ఎంపీని విచారించారు.

ఆర్ఆర్ఆర్ వెనకున్నది ఎవరు ? తెలుసుకొనే ప్రయత్నం చేశారు. టెక్నికల్ గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారనే ప్రశ్నలు వేశారు. ఐతే ఆర్ ఆర్ ఆర్ నుంచి సమాధానం లేదని తెలిసింది. ఎంపీకి అవసరమైన మందులు, అల్పాహారాన్ని ఆయన వ్యక్తిగత సిబ్బంది సీఐడీ కార్యాలయంలో ఈ ఉదయం అందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వాటిని ఎంపీకి అందజేశారు.

ఇక ఈరోజు కూడా ఆర్ ఆర్ ఆర్ ని సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఆర్ ఆర్ ఆర్ వెనకున్నది తెదేపా అధినేత చంద్రబాబు అని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇప్పుడు.. సీఐడీ విచారణలో దానిని ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారమ్.