చరణ్-శంకర్ సినిమాకు కొత్త చిక్కులు

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. #RRR తర్వాత చరణ్ చేయబోయే సినిమా ఇది. దిల్ రాజు నిర్మించనున్నారు. ఐతే ఇప్పుడీ.. ఈ సినిమాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయ్. అది చరణ్ నుంచి కాదు. దర్శకుడు శంకర్ వైపు నుంచి ఇండియ 2 పంచాయతీ సెగ చరణ్ సినిమాకు తగిలింది.

‘ఇండియన్‌ 2’ చిత్రీకరణను పూర్తి చేశాకే శంకర్‌ తన కొత్త సినిమాను మొదలుపెట్టాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. సామరస్యంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఈ కేసు జూన్‌కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో లైకా ప్రొడక్షన్‌ మరో అడుగు ముందుకేసినట్టు సమాచారం. ‘ఇండియన్‌ 2’ని పూర్తి చేసే వరకు శంకర్‌ కొత్త చిత్రం మొదలుపెట్టకుండా చూడాలని తెలుగు, హిందీ ఫిల్మ్‌ఛాంబర్స్‌కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇదేనిజమైతే… చరణ్‌-శంకర్‌ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.