మహేష్ కోసం.. పూజా, శిల్పా !

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈనెల 31న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే నటీనటులని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. ఇటీవల కాలంలో త్రివిక్రమ్‌ నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఓ బలమైన మహిళా పాత్ర కనిపిస్తుంటోంది.

ఇప్పటికే ఈ పాత్ర కోసం పలువురు సీనియర్‌ భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఫైనల్ గా సాగరకన్య శిల్పాశెట్టిని తీసుకున్నట్టు సమాచారమ్. అంతేకాదు.. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కనిపించనున్నారట. ఆ అవకాశం మరోసారి సుశాంత్ కి దక్కినట్టు తెలిసింది. ఇక హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకొన్నారని తెలుస్తోంది. మహర్షి సినిమా కోసం మహేష్-పూజా జతకట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ తో మరో రౌండ్ కి రెడీ అయింది బుట్టబొమ్మ.