కరోనా : ఆత్మీయులని కోల్పోయిన పాయల్

కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యులు, సెలబ్రెటీలు కరోనాతో మృతి చెందుతున్నారు. కరోనాతో గంటకో సెలబ్రెటీ, వారి కుటుంబ సభ్యుల మరణవార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆత్మీయులని కోల్పోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. పాయల్  కన్నీటి పర్యంతం అయింది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

“మిమ్మల్ని మేము ఎంతో మిస్‌ అవుతున్నాం అనితా ఆంటీ. మా అమ్మలానే మీరు కూడా నాపై ప్రేమ చూపించేవారు. నన్ను గారాబం చేసేవారు. ఇప్పటికీ నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మిమ్మల్ని మరలా వెనక్కి తీసుకురావాలని ఉంది. కానీ అందుకు అవకాశం లేదు కదా!!. ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు. కానీ నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు. కరోనా నుంచి కోలుకునేందుకు మీరు ఎంతో పోరాడారు. కానీ మీ లాంటి వ్యక్తిని మేము కోల్పోయాం” అని పాయల్ పేర్కొన్నారు.

ఈ నెల 6న పాయల్ కరోనా వాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే.