OTT రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన పాగల్ హీరో

కరోనా సెకండ్ వేవ్ తో మరోసారి థియేటర్స్ మూతపడ్డాయ్. దీంతో ఓటీటీ లో రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఐతే తెలుగు సినిమాలు అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఆసక్తి చూపకపోవడం విశేషం. ఇప్పటికే ‘ఖిలాడీ’ రవితేజ ఓటీటీ రిలీజ్ కి నో చెప్పేశాడు. థియేటర్స్ లోనే సందడి చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ‘పాగల్’ హీరో విశ్వక్ సేన్ కూడా అదే మాట చెప్పేశాడు. ‘పాగల్’ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

ఈ నగరానికి ఏమైంది సినిమాతో యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. ఫలక్ నుమా దాస్ యూత్, మాస్ కి మరింత దగ్గరయ్యాడు. హిట్ సినిమాతో తాను ఎంత  మంచి నటుడినో మరోసారి చూపించాడు. ఇప్పుడు పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్ లో నిర్మించిన విషయం తెలిసిందే. అసలైతే ఈ సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. అసలు చిన్న సినిమాలే ఓటీటీకి నో చెబుతుంటే.. ఇక పెద్ద సినిమాల గురించి చెప్పనక్కర్లేదు.