30 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడగింపు

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌ 21 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత కూడా లాక్‌డౌన్‌ పొడగిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడీ.. ఈ ప్రచారమే నిజమైంది. లాక్‌డౌన్‌ పొడగిస్తూ.. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేశారు. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ నెల 20న మరోసారి కేబినేట్ భేటీ ఉంటుంది. ఈ సమావేశంలో చర్చించిన తర్వాత లాక్‌డౌన్‌ పొడగిస్తారని చెప్పారు. కానీ అంతకంటే ముందే లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకోవడం విశేషం. మిగితా రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగించిన సంగతి తెలిసిందే. వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ తెలిపారు. ఇప్పుడు.. తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 తర్వాత కూడా మరోసారి పొడగించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సమాచారమ్.