వ్య‌క్తి నిజ‌మైన అవ‌స‌రం తీర్చాలి : రేణు

 ప్ర‌స్తుతం దేశానికి సోనూసూద్ లాంటి వ్య‌క్తి అవ‌స‌రం అని అందరూ అంటున్నారు. నటి రేణు దేశాయ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు సంక్షేమ ప‌థ‌కాల‌తో ప‌ని జ‌ర‌గ‌దు. ఒక వ్య‌క్తికి నిజ‌మైన అవ‌స‌రం ఏంటో తెలుసు కుని దాన్ని అందించాల‌ని ఆమె కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని వారికి కూడా త‌న వంతు సాయం చేస్తాన‌ని మ‌రోసారి ప్ర‌క‌టించారు.

ఇప్పటి వరకు  600 మంది క‌రోనా బాధితుల‌కు త‌న‌ వంతు సహకారం అందించిన‌ట్టు రేణూ తెలిపారు. పిల్లలు  అఖీరా, ఆద్య  కూడా త‌న సేవా కార్య‌క్ర‌మాల‌కు మద్దతు ఇస్తున్న‌ట్టు రేణూ దేశాయ్ తెలిపారు. ఇక పొలిటికల్ ఎంట్రీపై ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో త‌న‌కు  రాజకీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేశారు.