హాస్పటల్.. జైలుకి వెళ్లిన కేసీఆర్ !

వరంగల్ పర్యటనకి వెళ్లిన సీఎం కేసీఆర్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఎంజీఎం ఆసుపత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.

ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును సీఎం సంద‌ర్శించారు. ఈ సందర్భంగా  ఖైదీలు త‌యారు చేసిన ప‌లు ర‌కాల చేనేత ఉత్ప‌త్తులు, ఇత‌ర వ‌స్తువుల‌ను సీఎం ప‌రిశీలించారు.