రఘురామ విడుదల ఆలస్యం

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిన్న బెయిల్ లభించింది. సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అయినా రఘురామ ఇంకా జైలులోనే ఉన్నారు. బెయిల్‌కు సంబంధించిన సుప్రీం ఆదేశాలు ఎంపీ న్యాయవాదులకు అందని నేపథ్యంలో రఘురామ విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది. సోమవారం రఘురామ విడుదల కానున్నారు.  ప్రస్తుతం ఎంపీ సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని ఎంపీ రఘురామను సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బర్త్ డే రోజునే ఆయన్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకి తరలించారు. అరెస్ట్ చేసిన రాత్రి పోలీసులు తనని కొట్టారని రఘురామ ఆరోపించారు. కాలికి ఉన్న గాయాలని జడ్జికి చూపించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంపై సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లారు. సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది.