సింగర్ మధుప్రియకు వేధింపులు

సింగర్ మధుప్రియ  హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా కొంత మంది తనని వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. రెండ్రోజులుగా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయ్. అభ్యంతరకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారని.. దీంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇక సింగర్ గా మధు ప్రియ ఫుల్ బిజీ కాకపోయినా.. ఆడపాదడపా సినిమాలు పాటలు పాడుతోంది. ఫిదా సినిమాలో ఆమె పాడిన ‘పిల్లా.. రేణుక ‘ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఐతే ఒకప్పటిలా మధు ప్రియ స్టేజ్ షోస్ చేయడం లేదు. సినిమా ఆఫర్లు వస్తుండటంతో.. వాటిని బాగా తగ్గించేశారు.