TSలో 2,242, APలో 18,767 కేసులు !

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,242 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 19 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,53,277కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 3125కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇవాళ 4,693 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. 

ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో 18,767 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మరో 104 మంది కరోనాకు బలయ్యారు. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,80,827కి చేరింది. మృతుల సంఖ్య 10,126కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,237 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, తాజాగా 20,109 మంది కరోనా నుంచి కోలుకున్నారు.