దేశంలో 3లక్షలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఆదివారం ఉదయానికి దేశవ్యాప్తంగా 2లక్షల 99వేల కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. తాజాగా ఆయా రాష్ట్రాలు ప్రకటించిన రోజువారీ నివేదికలతో దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 3లక్షల దాటింది. 

ఇప్పటివరకు అత్యధిక కరోనా మరణాలు అమెరికాలో (5,89,000) చోటుచేసుకున్నాయి. కరోనా తీవ్రత అత్యంత ఎక్కువగా ఉన్న బ్రెజిల్‌లో కొవిడ్‌ మరణాలు 4లక్షల 48వేలు దాటాయి. కరోనా పాజిటివ్‌ కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్‌లో ఈ సంఖ్య 3 లక్షల మార్కును దాటింది. దీంతో..  ప్రపంచంలో అత్యధికంగా కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది.